రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకుని అప్పులపాలు చేశావు : మునుగోడు ఎమ్మెల్యే

ప్రజల మధ్య తిరుతున్నావ్ నీ ఎన్నికల స్టాంట్స్ ఏమి పనిచేయావ్..

Update: 2024-05-01 15:33 GMT

దిశ, బచ్చన్నపేట : ప్రజల మధ్య తిరుతున్నావ్ నీ ఎన్నికల స్టాంట్స్ ఏమి పనిచేయావ్.. ఇంట్లో కూర్చొని సేద తీరు అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకుని అప్పులపాలు చేసి, ఖాళీ చిప్ప అప్పజెప్పారని మండిపడ్డారు. బుధవారం ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా బచ్చన్న పేట లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఏది ఏమైనా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.

భువనగిరి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపించాలని కోరారు. రాజన్న అండతో ఇంకా మీ కోసం పనిచేస్తానని మీకు ఏ అవసరం వచ్చిన మా అన్నలాగా అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి కలిసి భారీ ర్యాలీ అనంతరం సభలో బీజేపీ కులం, మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.మన నీళ్లు పక్కకు పోతున్నాయని వాటిని ఎట్లా రావాలో అట్లా తెప్పించి ఆ పని పూర్తిచేసి పొలాల్లోకి జలాలను మల్లించడమే ధ్యేయంగా పనిచేస్తానాని కొమ్మూరి,చామల హామీనిచ్చారు.మీరు అందరూ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ రెడ్డి ని అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు జంగిటి విద్యానగర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News