ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దొంగలు ...!

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడి ఆసుపత్రిలో విలువైన సామాగ్రి కంప్యూటర్‌లు‌, బ్యాటరీ, ఇతర సామాగ్రి అపహరణ

Update: 2023-04-06 04:24 GMT

దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడి ఆసుపత్రిలో విలువైన సామాగ్రి కంప్యూటర్‌లు‌, బ్యాటరీ, ఇతర సామాగ్రి అపహరణకు గురి అయినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై ఎస్ఐ రమాదేవిని వివరణ కోరగా ఆస్పత్రిలో దొంగలు పడినట్లు మా దృష్టికి వచ్చిందని, కేసు నమోదు చేసి విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తానని ఎస్సై తెలిపారు.

Tags:    

Similar News