గణతంత్ర దినోత్సవం నాడే ఎగరని జాతీయ జెండా.. మండిపడుతున్న ప్రజలు

Update: 2022-01-26 12:59 GMT

దిశ, పాలకుర్తి: 73 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం పాలకుర్తిమండల కేంద్రంలో రెండు భిన్నమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చీఫ్ సెక్రటరీ ఆదేశాలు భేఖాతారు చేస్తూ మెడికల్ ఆఫీసర్ ఉదయం 9 గంటలకే జాతీయ పతాకం ఆవిష్కరించి సెక్రటరీ జీవోను సైతం లెక్క చేయలేదు. దీనితో పాటుగా పాలకుర్తిలోని బీసీ హాస్టల్‌లో వార్డెన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించలేదు. వేడుకల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తు్న్నారు.


Tags:    

Similar News