తన చావుకు సీఐ, ఎస్సై కారణమంటూ సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన వ్యక్తి..

తన చావుకు సీఐ, ఎస్సై కారణమంటూ, సూసైడ్ నోట్ రాసి

Update: 2024-05-01 12:38 GMT

దిశ, హనుమకొండ టౌన్ : తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ, సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన వ్యక్తి, హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంత్ అనే వ్యక్తి మిస్సింగ్ కేసు కలకలం రేపింది. పోలీసుల దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి, తన చావుకు హసన్ పర్తి సీఐ, ఎస్సై కారణమని వ్యక్తి అదృశ్యమయ్యాడు. తన దగ్గర అప్పు తీసుకున్నవారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే, వారు తనను కొట్టారని ఆరోపణ చేశాడు. తన భర్తను కాపాడి, హసన్ పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీకి భాదితుడి భార్య శ్యామల ఫిర్యాదు చేసింది. సీపీ ఆదేశాలతో మిస్సింగ్ కేసు నమోదు చేసి, అదృశ్యమైన ప్రశాంత్ కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Similar News