YSRTP ములుగు ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్ రెడ్డి

Update: 2022-01-25 13:40 GMT

దిశ, ములుగు: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. కాగా, శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 1995లో ప్రారంభమైంది. 2000 సంవత్సరం వరకు తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్‌గా, 2001 నుంచి 2006 వరకు తడ్వాయి జెడ్పీటీసీగా, 2003 నుంచి 2005 వరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2005 నుంచి 2008 వరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పటివరకు షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ టీపీ మహబూబాబాద్ పార్లమెంట్ కో-కన్వీనర్‌గా పనిచేశారు.

Tags:    

Similar News