భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్
వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు సందర్శించారు.
దిశ, ఎంజీఎం సెంటర్ : వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన స్పీకర్ దంపతులకు ఆలయ ఈ.ఓ శేషుభారతి, అర్చకులు మంగళవాద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.
ముందుగ ఆదిశంకరాచార్యులను, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం మహామండపంలో తమ్మినేని సీతారాం దంపతులకు వేదపండితులు, అర్చకులు అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి మహదాశీర్వచనం నిర్వహించి ప్రసాదములు అందజేశారు.