ఈ నెల 29న వాహనాల బహిరంగ వేలం:ఎస్పీ శరత్ చంద్ర పవార్

మహబూబాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడి తీసుకొని వెళ్లకుండా ఉన్న స్కార్ఫ్ మరియు రోడ్ వర్త్ 61 వాహనాలు జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏప్రిల్ 29వ తేదీన మధ్యాహ్నం 2:30 లకు బహిరంగ వేళం నిర్వహించడం జరుగుతుందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఓ ప్రకటనలో తెలిపారు.

Update: 2023-04-26 09:33 GMT

దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో  పట్టుబడి తీసుకొని వెళ్లకుండా ఉన్న స్కార్ఫ్ మరియు రోడ్ వర్త్ 61 వాహనాలు జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏప్రిల్ 29వ తేదీన మధ్యాహ్నం 2:30 లకు బహిరంగ వేళం నిర్వహించడం జరుగుతుందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఓ  ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో అన్నోన్ ప్రాపర్టీ కింద నమోదైన 61 వాహనాలను పోలీస్ హెడ్ క్వార్టర్లో భద్రపరచినట్టు జిల్లా ఎస్పీ తెలియచేయడం జరిగింది. జిల్లా ఎస్పీ మరియు కమిటీ అధికారుల సమక్షంలో వేలం వేయడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు  9441037994,/9492922964 లను సంప్రదించాలన్నారు.

Tags:    

Similar News