ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై రైతు మృతి

కరెంటు షాక్‌కు గురై రైతు మృతి చెందిన సంఘటన మంగళవారం దూల్మిట్ట మండలంలోని రెడ్యా నాయక్ తండాలో చోటు చేసుకుంది.

Update: 2023-05-09 07:59 GMT

దిశ,మద్దూరు&దూల్మిట్ట: కరెంటు షాక్‌కు గురై రైతు మృతి చెందిన సంఘటన మంగళవారం దూల్మిట్ట మండలంలోని రెడ్యా నాయక్ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దూల్మిట్ట మండలం రెడ్యా నాయక్ తండాకు చెందిన ధరావత్ కోటేష్ (55) మంగళవారం రోజున ఉదయం 11 గంటల ప్రాంతంలో తన భార్య లక్ష్మీతో కలిసి వ్యవసాయ పొలంలో వరి కోపించుటకు పొలం తడి ఆరినాదో చూడడానికి భర్త పొలంలోకి వెళ్లాడు.

రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు, గాలులకు కరెంటు వైర్ తెగి పొలంలో పడిపోయింది. దీంతో కరెంటు వైర్ తెగిన విషయం తెలియక కోటేష్ పొలంలోకి దిగగానే కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. భర్త కరెంట్ షాక్‌కు గురికాగానే భార్య భయంతో వెనుకకు పరిగెత్తిందని చెప్పారు.  కాగా మృతునికి భార్య,ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. కోటేష్ భార్య లక్ష్మీ  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మద్దూరు ఎస్సై నారాయణ తెలిపారు.

Tags:    

Similar News