జైల్లో పెడతారని భయంతోనే బీజేపీలోకి అరూరి : కడియం కావ్య

లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల రూపంలో బుద్ధి చెప్పి ఓడగోడితే మళ్లీ ఎంపీగా పోటీ

Update: 2024-05-01 14:40 GMT

దిశ,వర్థన్నపేట: లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల రూపంలో బుద్ధి చెప్పి ఓడగోడితే మళ్ళి ఎంపీగా పోటి చేస్తుండు అని, అరూరి కి మెదడు తలకాయ లో లేదని మొకాళ్ళ లో ఉందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు.బుధవారం వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి, కే ఆర్ నాగరాజు, డీసీసీబీ చైర్మన్ తో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ అరూరి రమేష్ కబ్జా కోరు అవినీతి పరుడు ఇలా ఎన్ని పేర్లు పెట్టిన తక్కువేనని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ కు జనబలం ఉంటే బీజేపీ కి ధన బలం ఉందని అన్నారు.ప్రతి మండలానికో గెస్ట్ హౌస్ లు కట్టుకున్నాడు.ఆరూరి అవినీతి అక్రమాలు బయటపడతాయని భయపెట్టి జైల్లో పెడుతారనే భయంతోనే బీజేపీ పార్టీలో చేరడాని అన్నారు.

కరోనా సమయంలో కడియం కావ్య చాటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. ఐదు సంవత్సరాల పాలనలో ఆరూరి ప్రభుత్వాసుపత్రికి మూడు నాలుగు సార్లు ప్రభుత్వ పథకాలను ప్రారంభోత్సవాలకు వచ్చాడే తప్ప హాస్పిటల్ అభివృద్ధిని పట్టించుకోలేదు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Similar News