వరంగల్ బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లో చేరిన మేయర్ సుధారాణి
లోక్సభ ఎన్నికల సమయంలో వరంగల్ బీఆర్ ఎస్ పార్టీకి మరో
దిశ,వరంగల్ బ్యూరో : లోక్సభ ఎన్నికల సమయంలో వరంగల్ బీఆర్ ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ వైపు చూసిన గుండు సుధారాణి గత కొద్దిరోజులుగా గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు అన్న చర్చ జరిగింది. అయితే ఆ చర్చకు ఊతమిస్తూ ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటనలో కూడా ఆమె పాల్గొనలేదు. కేటీఆర్ సభకు గుండు సుధారాణి డుమ్మా కొట్టారు.
కేటీఆర్ కి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కూడా ఆమె ఫోటో ఎక్కడ కనిపించలేదు. వాస్తవానికి గుండు సుధారాణి గత కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిశారు. ఈ సమయంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైందన్న వార్తలు వినిపించాయి. అయితే అనుహ్యంగా కొద్దిరోజుల పాటు ఆమె చేరికపై సస్పెన్స్ కొనసాగగా గురువారం జగ్గారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడం విశేషం. ఆమె చేరికను మంత్రి కొండా సురేఖ మురళీ దంపతులు అడ్డుకున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. సుధారాణి చేరికను వారు ఆహ్వానించలేదని సమాచారం.