గడ్డిమందు తాగిన యువకుడు మృతి

ప్రాణాపాయ స్థితిలో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన భీమదేవరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2023-03-30 15:55 GMT

దిశ, భీమదేవరపల్లి : ప్రాణాపాయ స్థితిలో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన భీమదేవరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మృతుని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామానికి చెందిన చేరాల శ్రీకాంత్ (23) కుటుంబ సమస్యలతో మార్చి 16న గడ్డి మందు తాగి ప్రాణాపాయ స్థితిలో వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ముల్కనూర్ ఎస్సై మహేందర్ తెలిపారు. 

Similar News