కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి(50) గుండెపోటుతో మృతిచెందాడు.

Update: 2023-02-23 17:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి(47) అనారోగ్యంతో మృతిచెందాడు. వివరాలలోకి వెళితే ... సైదాబాద్ వినయ్ నగర్‌లో నివాసముండే కిషన్ రెడ్డి సోదరి లక్ష్మీ, బావ నర్సింహారెడ్డిల కుమారుడు జీవన్​రెడ్డి(47). గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జీవన్​రెడ్డి ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు జీవన్​రెడ్డిని చికిత్స నిమిత్తం కంచన్‌బాగ్ డీఆర్డీఎల్​అపోలో ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ కాసేపటికే మృతిచెందాడు. జీవన్​రెడ్డి గుండెపోటుతో మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జీవన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.



 


Tags:    

Similar News