గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించడం సరికాదు: కిషన్ రెడ్డి

కేంద్రం నిధులతో చేపట్టిన అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకున్నదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

Update: 2023-02-03 15:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం నిధులతో చేపట్టిన అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకున్నదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గవర్నర్ చేత రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందన్నారు. జై తెలంగాణ కేసీఆర్ విస్మరించినా, గవర్నర్ తన ప్రసంగాన్ని జై తెలంగాణ అని చెప్పి ముగించడం రాష్ట్ర ప్రజల పట్ల ఆమెకున్న ఆదరాభిమానాలకు నిదర్శనమన్నారు. సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలు చేస్తుంటే 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పించడం హాస్యాస్పదమన్నారు. అబద్ధాలను ప్రచారం చేయడం మాని రాష్ట్ర సంక్షేమం పై దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి సూచించారు.

Similar News