MMTS-2కు కేసీఆర్ సహకరించడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎంఎంటీఎస్ ఫేజ్ -2 విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

Update: 2023-02-18 10:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంఎంటీఎస్ ఫేజ్ -2 విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఘట్ కేసర్ నుంచి యాదాద్రి వరకు నిర్మించాలనుకుంటున్న రెండో దశ లైన్ నిర్మాణాని సీఎం కేసీఆర్ చొరవ చూపాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద నిధులు విడుదల చేయడం లేదని చెప్పారు. శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బర్కత్ పురాలోని యాదాద్రి భవన్ నుంచి యాదగిరిగుట్టకు బయల్దేరిన అఖిండ జ్యోతియాత్రను కిషన్ రెడ్డి ప్రారంభించారు.

Tags:    

Similar News