బ్రేకింగ్: నగరవాసులకు అలర్ట్.. ఐదు రోజుల పాటు కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్!

హైదరాబాద్‌లో పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఐదు రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Update: 2023-04-04 13:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఐదు రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ అంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. కేబుల్ బ్రిడ్జి మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కాగా, వాహనదారులు, పర్యాటకులు దీనిని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. వాహనదారులు ప్రత్యమ్నాయమార్గాలు చూసుకోవాలని అధికారులు కోరారు. 

Tags:    

Similar News