ప్రొ. హరగోపాల్​పై ఉపా కేసు దుర్మార్గం.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

ప్రొ.హరగోపాల్ పై ఉపా కేసు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు.

Update: 2023-06-15 16:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రొ.హరగోపాల్ పై ఉపా కేసు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. తెలంగాణ లో అన్ని అంశాలపై అవగాహన ఉండి రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి హరగోపాల్ అని ఆయన గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.హరగోపాల్ ఒక నిష్పక్షపాత మేధావిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు.ప్రొ జయశంకర్ లాంటి వారితో కలిసి పోరాటాలు చేసిన ఉద్యమ కారుడన్నారు.సమకాలీన సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేసి ప్రజలకు న్యాయం అయ్యేలా కృషి చేసిన మనిషి అని కొనియాడారు.

అలాంటి వ్యక్తిపై ఉపా కేసు లు పెట్టి వేధించడం ఈ పాలకుల దుశ్చర్యలకు నిదర్శనమన్నారు. గతంలో నక్సలైట్లు ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేస్తే, ప్రభుత్వం కోరిక మేరకు మధ్యవర్తిత్వం వహించి వారి విడుదలకు సహకరించిన వ్యక్తి హరగోపాల్ అని వివరించారు. వెంటనే ఆయన పై పెట్టిన ఉపా కేసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News