తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి కీలక పిలుపు (వీడియో)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాగర్కర్నూలు జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ''రాష్ట్రంలో దళిత, గిరిజనులను బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారు. వారికి కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. భూస్వాములు, దొరలు దళితులపై దాడులు చేస్తుంటే వారిని దిగంతాలను తరిమిన చరిత్ర ఈ గడ్డది. దొరలకు బీఆర్ఎస్కు, పెట్టుబడిదారులకు బీజేపీ ఉంది. కానీ దళిత గిరిజనులకు కాంగ్రెస్ ఉంది. ఎప్పటికైనా పేదల బాధలు తీర్చేది కాంగ్రెస్ పార్టీనే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు అండగా ఉండండి'' అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read...
కొత్త సచివాలయంలో KCR సంచలన ప్రకటన.. ప్రత్యర్థులు సిద్దం కాకముందే దెబ్బకొట్టేలా ప్లాన్?