Revanth Reddy: ఉద్యమ ద్రోహి పాలనలో పైలం బిడ్డో.. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

TPCC Chief Revanth Reddy Criticizes CM KCR Over Government School Conditions| సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు అస్తవ్యస్తంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రభత్వ తీరుపై మండిపడ్డారు

Update: 2022-08-08 11:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : TPCC Chief Revanth Reddy Criticizes CM KCR Over Government School Conditions| సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు అస్తవ్యస్తంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రభత్వ తీరుపై మండిపడ్డారు. ఉద్యమ ద్రోహి పాలనలో పైలం బిడ్డో.. అని బడికి పంపే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. చదువుకునే చోటు లేదని, చదువుకునెందుకు పుస్తకం లేదని, చదువు చెప్పే గురువులు లేరని విమర్శించారు. సర్కార్ బడుల్లో పసి పిల్లల ప్రాణాలకు భరోసా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన సర్కారు బడులపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని పేర్కొన్నారు. పెచ్చులూడిన గోడలు కూలిపోయిన గదులు దర్శనమిస్తున్నాయని, విద్యార్థులకు కలుషిత దాగునీరు పురుగులు పట్టిన అన్నమే గతి అయిందని విమర్శించారు.

ఇది కూడా చదవండి: ''పొంగులేటి వారి పెళ్లి''.. ప్రతి ఇంటికి పెళ్లి పత్రిక, గడియారం..

Tags:    

Similar News