ముగ్గురు ఐపీఎస్‌లకు పదోన్నతి

2005 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన ముగ్గురు ఐపీస్ అధికారులకు ఐజీలుగా పదోన్నతినిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసారు.

Update: 2023-05-02 09:29 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: 2005 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన ముగ్గురు ఐపీస్ అధికారులకు ఐజీలుగా పదోన్నతినిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసారు. ప్రమోషన్ పొందిన వారిలో అవినాష్ మొహంతి, పి. విశ్వప్రసాద్, ఎం. రమేష్ ఉన్నారు. ప్రస్తుతం సైబరాబాద్ అదనపు కమిషనర్ (అడ్మిన్) గా ఉన్న అవినాష్ మొహంతి అక్కడే కొనసాగుతారు. హైదరాబాద్ అదనపు సీపీ (ఎస్బీ) గా ఉన్న విశ్వప్రసాద్, పోలీస్ ప్రొవిజన్స్, లాజిస్టిక్స్ ఐజీగా ఉన్న రమేష్ కూడా అవే స్థానంలో విధులు నిర్వర్తిస్తారు.

Tags:    

Similar News