పాఠశాల భవనం నుంచి దూకిన విద్యార్థి.. ఒంటరినయ్యానని..
దిశ, ముధోల్: ఓ విద్యార్థి పాఠశాల భవనం నుంచి దూకిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దిశ, ముధోల్: ఓ విద్యార్థిని పాఠశాల భవనం నుంచి దూకిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బైంసా మండలం ఖత్గావ్ గ్రామంలో గల వేదం తపోవన్ పాఠశాలలో కీర్తిక 9వ తరగతి చదువుతుంది. తన స్నేహితురాలు వేదం పాఠశాలలో చదువు హాస్టల్లో ఉండగా.. ఇటీవల స్నేహితురాలు ఆ పాఠశాల నుండి వేరే పాఠశాలకు వెళ్ళిపోయింది. కీర్తిక ఒంటరినని ఫీల్ అయి మనోవేదనకు గురైందని తెలిపారు. అంతేకాక ఈ హాస్టల్లో ఉండలేనంటూ అక్కడ సిబ్బందితో, తమ తల్లిదండ్రులతో పలుమార్లు చెప్పనని కీర్తిక తెలిపింది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం తెల్లవారుజామున పాఠశాల పై భవనం నుంచి దూకిందని బంధువులు, పాఠశాల సిబ్బంది తెలిపారు. కీర్తిక భవనంపై నుంచి దూకడంతో వెన్నెముకకు గాయం అయిందని, మెరుగైన వైద్యం కోసం తనను హైదరాబాద్కు తరలించినట్లు పేర్కొన్నారు.