మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్ ఘటనపై గవర్నర్ సీరియస్.. 48 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్

టీనేజ్ బాలికపై జరిగిన సామూహిత్య అత్యాచార ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా డీజీపీ, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, రాచకొండ పోలీసు కమిషనర్, మీర్‌పేట్ ఏసీపీ

Update: 2023-08-22 16:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీనేజ్ బాలికపై జరిగిన సామూహిత్య అత్యాచార ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా డీజీపీ, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, రాచకొండ పోలీసు కమిషనర్, మీర్‌పేట్ ఏసీపీ తదితరులను గవర్నర్ ఆదేశించారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వివరాలను పరిగణలోకి తీసుకున్న గవర్నర్.. ఈ ఘటనపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసినట్లు రాజ్‌భవన్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది.

ఈ సంఘటనకు సంబంధించి సమగ్రమైన వివరాలతో పాటు పోలీసు శాఖ నుంచి తీసుకున్న చర్యలు, నిందితుల అరెస్టు తదితరాలన్నింటినీ నివేదికలో పొందుపర్చి 48 గంటల్లోగా అందజేయాలని గవర్నర్ ఆదేశించినట్లు ఆ ప్రకటన పేర్కొన్నది. బాధితులకు అండగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాలను అందించాల్సిందిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా బాధ్యులను ఆదేశించినట్లు తెలిపింది. 

Tags:    

Similar News