TG Govt.: రేషన్ కార్డుదారులకు బంపర్ న్యూస్.. సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఖరారు!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం బంపర్ న్యూస్ చెప్పింది.

Update: 2024-05-23 14:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా వచ్చే సంవత్సరం జనవరి నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సన్న బియ్యం సాగు, ఉత్పత్తి, ప్రొక్యూర్‌మెంటు, మిల్లింగ్‌ తదితర అంశాలపై అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. ఇక సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ సెంటర్లకు సన్న బియ్యాన్నే అందిస్తుండగా రేషన్‌ షాపుల్లో మాత్రం దొడ్డు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90.23 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వారి కోసం ప్రతి నెలా 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అందిస్తుండగా.. ఏడాదికి 21 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం అవుతున్నాయి. ప్రస్తుతం సర్కారు తీసుకున్న నిర్ణయంతో 2.82 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పీడీఎస్‌ ద్వారా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టుబోతోంది. 


ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ పట్టభద్రుడు!.. కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్ 

Tags:    

Similar News