Tenth Paper Leak: : ఈటల పీఏల స్టేట్‌మెంట్ రికార్డు

టెన్త్ హిందీ ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2023-04-07 08:33 GMT

దిశ, వరంగల్ బ్యూరో: టెన్త్ హిందీ ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఈటల పీఏలు రాజు రెడ్డి, నరేందర్ లు డీసీపీ కార్యాలయానికి వచ్చారు. విచారణ సందర్భంగా రాజురెడ్డి, నరేందర్ ల స్టేట్ మెంట్ లను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం ఇద్దరి మొబైల్స్‌ను విచారణ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హిందీ పేపర్ లీకేజీ కేసులో నిన్న ఇద్దరికీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News