బ్రేకింగ్: ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ మీటింగ్.. ఆ అంశంపైనే ప్రధాన చర్చ..!

Update: 2023-03-09 11:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్నందున మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు సహా పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. కవితను అరెస్ట్ చేస్తే తదుపరి కార్యచరణ ఏంటి అన్న అంశంతో పాటు స్థలాల క్రమబద్ధీకరణ, పేదలకు స్థలాల పంపిణీ, మూడో విడత గొర్రెల పంపిణీ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వంటి విషయాలపై మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News