త్వరలో ఆ ఎంపీలు సభ్యత్వం కోల్పోతారు.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

మోడీ, అమిత్ షాతో పాటు ఎంపీ అర్వింద్, బండి సంజయ్ లవి ఫేక్ డిగ్రీలే అని బాల్కసుమన్ ఆరోపించారు.

Update: 2023-04-08 08:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: మోడీ, అమిత్ షాతో పాటు ఎంపీ అర్వింద్, బండి సంజయ్ లవి ఫేక్ డిగ్రీలే అని బాల్కసుమన్ ఆరోపించారు. త్వరలో నిజాలు బయటకు వస్తాయని వారు సభ్యత్వం కోల్పోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాటాకు చప్పుళ్లకు ఉడుత ఊపులకు భయపడేది లేదన్నారు. తెలంగాణకు రూపాయి ఇయ్యా అన్న కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీలో చేర్చుకున్నారని మండి పడ్డారు. మంచిర్యాలలో బీఆర్ఎస్ దర్నాలో పాల్గొన్న ఆయన సింగరేణి తెలంగాణకు కొంగు బంగారమన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. ఇప్పటికే పలుమార్లు గనుల వేల ప్రక్రియ ప్రయత్నం చేసినా ప్రైవేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. 

Tags:    

Similar News