సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది.

Update: 2023-03-22 11:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. ఏప్రిల్ 5 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్  అవెన్యూ కోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. ఈడీ కస్టడీ ముగియడంతో సిసోడియాను అధికారులు ఇవాళ స్పెషల్ జడ్జి ఎంకే నాగ్ పాల్ ఎదుట హాజరుపరచగా మరో రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ పొడిగించారు. ప్రస్తుతం సిసోడియా తిహార్ జైలులో ఉన్నారు. ఈ కేసులో సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 24కు కోర్టు వాయిదా వేసింది


Tags:    

Similar News