డీఏవీ స్కూల్ ఘటన.. నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు

రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటనలో నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Update: 2023-04-18 07:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటనలో నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆరు నెలల దర్యాప్తు కొనసాగగా, దోషికి విచారణ తర్వాత శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడయింది. అయితే గతేడాది అక్టోబర్ 17న ఘటన జరుగగా నిందితుడిని 19న పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రజనీకుమార్ పాఠశాల ప్రిన్సిపాల్‌కు కారు డ్రైవర్ గా పనిచేశాడు.

Tags:    

Similar News