రేవ్ పార్టీ కేసులో సంచలనం.. టాలీవుడ్ నటులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనం చోటు చేసుకుంది.

Update: 2024-05-23 07:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనం చోటు చేసుకుంది. తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. 98 మంది శాంపిల్స్‌ను సీసీబీ సేకరించింది. నటి హేమ, ఆషీరాయ్, వాసు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హేమ స్నేహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. దీంతో నటి హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే పదే పదే తాను రేవ్ పార్టీలో లేను అని ఓ వైపు హేమ చెబుతుండగా.. టాలీవుడ్ నటి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే హేమ బెంగళూరు వెళ్లినట్లు ఫ్లయిట్ టికెట్ సోషల్ మీడియాలో వైరల్ కావడం సంచలనంగా మారింది.

Read more : రేవ్ పార్టీలో షాకింగ్ విషయాలు.. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్! 86 మందికి పాజిటివ్

Tags:    

Similar News