ప్రణయ్రాయ్ రాజీనామాపై ఆర్ఎస్పీ ఆసక్తికర ట్వీట్
ప్రముఖ వ్యాపార వేత్త అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ గౌతమ్ అదానీ ఎన్డీటీవీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ వ్యాపార వేత్త అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ గౌతమ్ అదానీ ఎన్డీటీవీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ప్రమోటర్ గ్రూప్ ఆర్ఆర్పీఆర్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేసే తేదీ సమీపిస్తుండడంతో రాయ్ దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, వీరు రాజీనీమా చేయడంపై ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సైతం స్పందించారు. గురువారం బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా రాయ్ రాజీనామాపై స్పందించారు. తామంతా విద్యార్థి రోజుల నుండి ఎన్డీటీవీతో పెరిగామన్నారు. 'ద వల్డ్ దిజ్ వీక్' కోసం మా హాస్టల్ టీవీ రూమ్లలో మా సీట్లను బుక్ చేసుకునేవాళ్లం! అని ఆర్ఎస్పీ తెలిపారు. కానీ ఇప్పుడు అది బిగ్ కార్పొరెట్ ప్రెడిక్టర్ చేతిలోకి వెళ్లిందని, మన దేశంలో సోషల్ మీడియాలో తప్ప ఇక సత్యం, ఉదారవాద ఆలోచనలపై ఆశలు లేవంటూ ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు. ట్వీట్తో పాటు ప్రణయ్ రాయ్ను ట్యాగ్ చేశారు.
We all grew up with #NDTV since our student days. We used to book our seats in our hostel TV Rooms for #TheWorldThisWeek ! Now that it is grabbed by #BIGCorporatePredators, there's no hope left for truth and liberal ideas in our nation except on Social Media. @PrannoyRoyNDTV
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 2, 2022