బహుజనులకు అన్యాయం.. బడ్జెట్‌పై ఆర్ఎస్పీ సీరియస్

బడ్జెట్‌లో బహుజనులకు మరోసారి అన్యాయం జరిగిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.

Update: 2023-02-06 13:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్‌లో బహుజనులకు మరోసారి అన్యాయం జరిగిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సోమవారం బహుజన రాజ్యాధికార యాత్రలో ధర్మారం మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్ ఎస్పీ బడ్జెట్ పై స్పందించారు. జనాభాలో సగమున్న బీసీలకు బడ్జెట్ లో కేవలం మూడు శాతం మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. 1.5 లక్షల కోట్లు కేటాయించాల్సిన చోట కేవలం రూ.6 వేల కోట్లు ఇచ్చి వివక్ష చూపారని ఆరోపించారు. బీఎస్పీ పెరుగుతున్న ఆదరణను చూసే ఎస్సీలకు రూ.36 వేల కోట్లు కేటాయించారన్నారు. అయితే దళితబంధు పథకానికి గతేడాది కేటాయించిన రూ.17 వేల కోట్లు ఎవరికి పంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News