తెలుగు చిత్ర పరిశ్రమలో షార్ట్ ఫిలిం పాత్ర ఎంతో కీలకం : Rajendra Prasad

తెలుగు చిత్ర పరిశ్రమలో షార్ట్ ఫిలిం పాత్ర ఎంతో కీలకమని ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

Update: 2022-12-26 15:43 GMT

దిశ, అంబర్‌పేట్: తెలుగు చిత్ర పరిశ్రమలో షార్ట్ ఫిలిం పాత్ర ఎంతో కీలకమని ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కళారాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో తెలుగు షార్ట్ ఫిలిం అవార్డ్స్ నగరంలోని టీ హబ్‌లో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ సంగీత దర్శకుడు చంద్రబోస్ పాల్గొని ఉత్తమ షార్ట్ ఫిలిం, దర్శక, నిర్మాతలకు అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. సమాజాన్ని చైతన్య పరిచే షార్ట్ ఫిలింలను నిర్మించాలని దర్శక, నిర్మాతలకు సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి అందెశ్రీ , కళారాజ్ అధినేత శ్రీనివాస్ మర్రి, సందీప్ కుమార్ మక్తాల, శ్రీనివాస్ రావు , ప్రవీణ్ కుమార్ మాచవరం , గౌరీ శంకర్ మామిడి పాల్గొన్నారు.

Tags:    

Similar News