ఆ రోజు రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు.. CM రేవంత్ రెడ్డి ఎమోషనల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఎమోషనల్ అయ్యారు.

Update: 2024-05-10 12:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఎమోషనల్ అయ్యారు. మక్తల్‌లో నిర్వహించిన జన జాతర సభలో రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను గుర్తుచేసుకుని ఎమోషల్ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక నుంచి తెలంగాణలోకి జోడో యాత్ర ఎంట్రీ సందర్భంగా నాకు నిద్ర పట్టలేదని చెప్పుకొచ్చారు. రాహుల్ కు ఎలా స్వాగతం పలకాలని ఆందోళనలో ఉన్నానని అన్నారు. కానీ పాలమూరు ప్రజలు బ్రహ్మరథం పట్టి భరోసా ఇచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి భారత్ జోడో యాత్రను గర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవ్వడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News