వంశీ చంద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి : వీర్లపల్లి శంకర్

పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ

Update: 2024-04-29 10:46 GMT

దిశ,కేశంపేట్ : పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మండల పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంత సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న వంశీ చంద్ రెడ్డి ని ఎంపీగా గెలిపించుకోవాలన్నారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. విద్యావంతుడు, యువకుడు అయిన వంశీ చంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల ఇన్చార్జిలు వెంకట్ రామ్ రెడ్డి , ఇబ్రహీం, మండల పార్టీ అధ్యక్షుడు వీరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పట్లూరి , జగదీశ్వర్ , ఎంపీటీసీ సురేష్ రెడ్డి, నాయకులు కరుణాకర్ రెడ్డి, గిరి యాదవ్, శ్రీధర్ రెడ్డి, అనసూయమ్మ, మధుసూదన్ రెడ్డి, రూప్లా నాయక్ , కోడూరు రాములు , భాస్కర్ గౌడ్, రమేష్, తుమ్మల గోపాల్, రావుల పెంటయ్య , ప్రకాష్ గౌడ్, నరసింహారెడ్డి, సురేష్,జంగయ్య, అర్జునయ్య, పాల్గొన్నారు.

Similar News