ఒంటరి మహిళలే వాళ్ళ టార్గెట్…

చైన్ స్నాచింగ్ దొంగలు ఒంటరి మహిళలే టార్గెట్ గా రెచ్చిపోతున్నారని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ సీఐ ఏ నరసింహారావు అన్నారు.

Update: 2024-04-16 10:23 GMT

దిశ, యాచారం : చైన్ స్నాచింగ్ దొంగలు ఒంటరి మహిళలే టార్గెట్ గా రెచ్చిపోతున్నారని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ సీఐ ఏ నరసింహారావు అన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలంలో బిల్డింగ్ మీద పడుకుంటే అదే అదునుగా దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారని, ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలోనే పడుకోవాలని సూచించారు. ఇంటి ఆరుబయట పొలాల వద్దకు వెళ్లే ఒంటరి మహిళలే టార్గెట్ చేసుకొని బైకులపై వచ్చి బంగారు గొలుసులను దొంగలించకపోతున్నారని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Similar News