కాంగ్రెస్ ఆరు పథకాలలో మహిళలకే పెద్దపీట : చామల డింపుల్

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్

Update: 2024-05-01 14:48 GMT

దిశ, ఇబ్రహీంపట్నం : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి అంటూ ఇబ్రహీంపట్నం బుధవారం అంగడిలో మార్కెట్ కు కూరగాయలు వచ్చిన మహిళలకు కాంగ్రెస్ పథకాల గురించి తెలియజేస్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డి సతీమణి డింపుల్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ 6 గ్యారెంటీలలో మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు, జిల్లా జనరల్ సెక్రెటరీ ముత్యాల రాజశేఖర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, కౌన్సిలర్లు బర్ల మంగ జగదీష్, ఆకుల మమత నందు, ముత్యాల సంతోష్, చనమోని గోపాల్, నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Similar News