సివిల్స్‌లో 770 ర్యాంకు సాధించిన పెద్దేముల్ మండల యువకుడు

సివిల్స్ ర్యాంక్ సాధించడం లో సత్తా చాటిన పెద్దేముల్ మండలం

Update: 2024-04-17 09:41 GMT

దిశ,పెద్దేముల్: సివిల్స్ ర్యాంక్ సాధించడం లో సత్తా చాటిన పెద్దేముల్ మండలం గోట్లపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అష్ఫాక్. ఇతను సామాన్య కుటుంబంలో జన్మించి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసిన ఫలితాలలో 770 ర్యాంకు సాధించడంతో పెద్దేముల్ మండలంలోని గోట్లపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవ్సరాల క్రితం హైదరాబాద్ పట్టణానికి వలస వెళ్లిన జాఫర్, కష్టపడుతూ తన పిల్లలను చదివించి ఉన్నత స్థానానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేవు. మహమ్మద్ అష్ఫాక్ సివిల్స్ కు ఎంపిక కావడం తో గ్రామస్తులు మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News