హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన

తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ బుధవారం సాయంత్రం రాజేంద్రనగర్లో శంకుస్థాపన చేశారు.

Update: 2024-03-27 13:50 GMT

దిశ, రాజేంద్రనగర్ : తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ బుధవారం సాయంత్రం రాజేంద్రనగర్లో శంకుస్థాపన చేశారు. హైకోర్టు భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 100 ఎకరాల భూమిని రాజేంద్రనగర్ లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో నుంచి ఇచ్చిన విషయం తెలిసిందే. భూమి కేటాయింపును నిరసిస్తూ చాలా రోజులుగా విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పోలీసులు కొందరు విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హైకోర్టు భవనం స్థాపన కార్యక్రమానికి అధికారులు మీడియాను అనుమతించలేదు. 

Similar News