రైతులను ధనవంతులను చేయాలి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

బయట దేశాలలో రైతులు ధనవంతులు ఎలా ఉన్నారో

Update: 2024-04-30 13:53 GMT

దిశ, చేవెళ్ల : బయట దేశాలలో రైతులు ధనవంతులు ఎలా ఉన్నారో మన దేశంలో కూడా రైతులను ధనవంతులు చేయాలని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కెజీఆర్ గార్డెన్ లో మంగళవారం రైతు సమ్మేళనం కిసాన్ మోర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అతిథులుగా పాల్గొని మాట్లాడారు. బయట దేశాలలో రైతులు ధనవంతులు ఎలా ఉన్నారో ఇక్కడి కూడా రైతులు ధనవంతులను చేయాలని మోడీ ఆలోచిస్తాన్నాడు అని అన్నారు. విద్యుత్ లక్ష కోట్ల స్కామ్ అని అన్నారు. రైతు చట్టాల గురించి తెలియని వాళ్ళు అప్పుడు ధర్నాలు చేశారు అని, ప్రభుత్వం వస్తే రైతు మూడు చట్టాలు మళ్ళీ తీసుకు వస్తుంది అని అన్నారు. రైతుబంధు భూస్వాములకు ఎందుకని ప్రశ్నించారు.

రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ : తల్లొజు ఆచారి

రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని తల్లొజు ఆచారి అన్నారు. రైతులె కాంగ్రెస్ పార్టీని పాత పెడతారు అని, ఆరు గ్యారంటీలు ఏవి అని, 2 రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అని అన్నారు. 17 ఎంపీ స్థానాలు గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు. సారా సీసా అమ్మడానికి పోతే కవిత కడిగిన ముత్యం లాగా ఎలా వస్తుందాని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు,కిసాన్ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News