మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన ఫోన్​ ట్యాపింగ్​ చేశారని ఆరోపిస్తూ డీజీపీ రవిగుప్తాకు బుధవారం మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఫిర్యాదు చేశారు.

Update: 2024-03-27 15:19 GMT

దిశ, బడంగ్ పేట్ : ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన ఫోన్​ ట్యాపింగ్​ చేశారని ఆరోపిస్తూ డీజీపీ రవిగుప్తాకు బుధవారం మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ మంత్రి సబిత పోలీసులను అడ్డం పెట్టుకుని ఫోన్ ను ట్యాపింగ్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో దొంగ ఓట్లు, తన ఫోన్ ట్యాపింగ్​ ద్వారా గెలిచారని అందెల ఆరోపించారు. అందెల వెంట మహేశ్వరం నియోజకవర్గం కన్వీనర్ ఎల్మేటి దేవేందర్ రెడ్డి, వెంకటేశ్ తదితరులు ఉన్నారు. 

Similar News