చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీలకు చమరగీతం పాడాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు
దిశ, బడంగ్ పేట్ : మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీలకు చమరగీతం పాడాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ లో ఆర్చిడ్ కాలనీ, మెట్రో సిటీ కాలనీ, సి.పి.ఎన్.ఆర్ కాలనీ లలో ప్రచారం నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జి నిజాముద్దీన్, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మైనారిటీ చైర్మన్ అఫ్జల్, బాలింగని జంగయ్య ,రియసత్,బాబా భాయ్,మెహముద్, రియాజ్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.