వివేక్ ఇంటిపై రెయిడ్స్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రాష్టంలో కాంగ్రెస్ ప్రభంజనం తట్టుకోలేక ప్రధాని మోడీ తన చీకటి మిత్రుడు కేసీఆర్ గెలుపుకోసం కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులకు ఉసిగొల్పుతున్నారని ట్వీటర్ వేదికగా టీపీసీసీ చీఫ్

Update: 2023-11-21 16:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలో కాంగ్రెస్ ప్రభంజనం తట్టుకోలేక ప్రధాని మోడీ తన చీకటి మిత్రుడు కేసీఆర్ గెలుపుకోసం కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులకు ఉసిగొల్పుతున్నారని ట్వీటర్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పోటీ చేసే స్థానాలతో పాటు రాష్ట్రములో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే స్థానాలలో అభ్యర్థులను మానసికంగా కుంగదీసేందుకు మోడీ దింపుడు కళ్ళం ఆశతో పెంపుడు కుక్కలాంటి ఈడీ, ఐటీలను తమ నేత వివేక్ వెంకటస్వామి ఇంటిపై దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వీరి కుతంత్రాలు కాంగ్రెస్ గెలుపును ఆపలేవని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News