ములుగు సభలో మహిళా డిక్లరేషన్

తెలంగాణ ఎన్నికల్లో గెలుపుపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వాన్ని స్పీడప్ చేసింది.

Update: 2023-10-18 08:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎన్నికల్లో గెలుపుపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వాన్ని స్పీడప్ చేసింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలను ప్రకటించిన హస్తం పార్టీ.. వివిధ వర్గాలను ఆకర్షించేందుకు ప్రత్యేక డిక్లరేషన్లు ప్రకటిస్తూ వస్తోంది. ఎస్సీ ఎస్టీ, నిరుద్యోగ డిక్లరేషన్లు ఇప్పటికే ప్రకటించగా ఈరోజు మహిళా డిక్లరేషన్ ప్రకటించబోతున్నది. ములుగు జిల్లా రామానుజపురం లో ఇవాళ సాయంత్రం జరగబోయే బహిరంగ సభలో పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మహిళా డిక్లరేషన్ పై ఆసక్తి ఏర్పడింది. మరో వైపు పార్టీ ఇచ్చిన హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు పక్కాగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో తొలి విడత బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు.

Tags:    

Similar News