చివరి రోజు ప్రచారం హోరెత్తించనున్న ప్రియాంక, రాహుల్
తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు విస్తృతంగా పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం రాహుల్ గాంధీ ఉదయం10:30 గంటలకు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు విస్తృతంగా పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం రాహుల్ గాంధీ ఉదయం10:30 గంటలకు జూబ్లీహిల్స్ ఆటో వర్కర్స్ యూనియన్, జీహెచ్ఎంసీ, గిగ్ వర్కర్స్ యూనియన్తో ఇంటరాక్షన్ కానున్నారు. ఉదయం11.30 గంటలకు నాంపల్లిలోని రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. దీంతో పాటు ప్రియాంక గాంధీ ఉదయం 11.30 గంటలకు జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసగించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇక ఏఐసీసీ, కర్ణాటక లీడర్లంతా పోల్ మేనేజ్ మెంట్పై ఫోకస్ పెట్టారు. చివరి రోజు అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా మైక్రోమేనేజ్ మెంట్, పోల్ మేనేజ్ మెంట్లు చేయనున్నారు. దీంతో పాటు చివరి రోజు కీలక నేతలందరితోనూ పార్టీ ముఖ్య నేతలు ఇంటర్నల్ మీటింగ్లు నిర్వహించనున్నారు.