వేములవాడలో కోడె మొక్కులు చెల్లించుకున్న ప్రధాని మోడీ

వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Update: 2024-05-08 04:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ ఆలయంలో ప్రత్యేకంగా నిలిచే కోడె మొక్కులను ప్రధాని చెల్లించుకున్నారు. ఆలయంలోకి వస్తున్న సమయంలో ప్రధాని మోడీ క్యూలో వేచి ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆలయ అర్చకులు ప్రధానిమోడీకి మెమొంటో ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం మోడీ వేద పండితుల ప్రత్యేక ఆశీర్వాదాలు తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ వేములవాడ, వరంగల్‌లలో నిర్వహిచే బహిరంగ సభలలో పాల్గొననున్నారు. తొలుత బాలానగర్‌లో బండి సంజయ్ కు మద్దతుగా మోడీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. అనంతరం వరంగల్ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్‌కు ఎన్నికల బహిరంగ సభలో మోడీ పాల్గొని ప్రసంగిస్తారు.

Similar News