హైదరాబాద్‌లో హై అలర్ట్

శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో తలపెట్టిన శోభాయాత్రతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు.

Update: 2023-03-30 08:21 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో తలపెట్టిన శోభాయాత్రతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ఇప్పటికే శోభాయాత్రను పురస్కరించుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీతారామ్‌బాగ్ నుంచి శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభం కానుండగా సుల్తాన్‌బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది.

మధ్యాహ్నం ఒంటి గంటకు శోభాయాత్ర ప్రారంభంకానుంది. సీసీ కెమెరాల నిఘాలో శోభాయాత్ర 6 కిలోమీటర్ల మేర సాగనుంది. శోభాయాత్ర రూట్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలుచోట్ల ట్రాఫిక్ మళ్లించనున్నారు. సీతారాంబాగ్ ఆలయం, బోయగూడ కమాన్ నుంచి శోభాయాత్ర ధూల్‌పేట, జుమేరాత్ బజార్, గౌలిగూడ కమాన్ మీదుగా ఈ శోభాయాత్ర సాగనుంది. కోఠి ఆంధ్రా బ్యాంక్, హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది. 

Tags:    

Similar News