Kasani Gnaneshwar Mudiraj : పార్టీ మార్పు ప్రచారం..కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ!

పార్టీ మార్పు ప్రచారం టీటీడీపీ అధ్యక్షడు కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ ఇచ్చారు.

Update: 2023-10-28 09:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పు ప్రచారం టీటీడీపీ అధ్యక్షడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. బీజేపీతో పొత్తుల అంశంలో ఇంకా క్లారిటీ రాలేదన్నారు. రేపు ఉదయం లోకేష్ తో చర్చించి ఫైనల్ చేస్తామన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగానే ఉందన్నారు. తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదన్నారు. తన దృష్టిలో టీడీపీ మాత్రమే బెస్ట్ అని అన్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించడంతో ఆయన నొచ్చుకన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో కాసాని గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన వ్యాఖ్యలతో టీడీపీ తెలంగాణలో బరిలో ఉండనున్నట్లు తెలిసింది. 

Tags:    

Similar News