ఆ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు: మంత్రి హరీష్ రావు

ఆశా వర్కర్లకు, సెకండ్ ఎఎన్ఎంలకు వేతనంలో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వాలని ఉన్నతాధికారులను మంత్రి హారీష్ రావు ఆదేశించారు.

Update: 2023-06-06 08:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ఆశా వర్కర్లకు, సెకండ్ ఎఎన్ఎంలకు వేతనంలో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వాలని ఉన్నతాధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు ఏ విధంగా సెలవులు ఇస్తున్నారో అలాగే ఆశా వర్కర్ల సంక్షేమంపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆశా వర్కర్ల నెలవారి సమీక్షలో పాల్గొన్న హారీష్ రావు ప్రత్యేక రాష్ట్రం అనంతరం ఆశా వర్కర్లకు 3 సార్లు జీతాలు పెంచి.. ప్రస్తుతం 9,750 రూపాయలు అందజేస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News