హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా బీఆర్ఎస్ మాత్రమే అడ్డుకోగలదు: మాజీ మంత్రి కేటీఆర్

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-28 11:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను ఓడించలేదని.. తమని తామే ఓడించుకున్నామని.. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడ‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ అన్నారు. అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసే అరాచకాలను అడ్డుకోవాలంటే.. బీఆర్ఎస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించాలని అన్నారు. దీంతో పాటుగా.. బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తే.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా అడ్డుకోగలుతామని అన్నారు. అలాగే.. డీలిమిటేషన్ లో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని.. 12 స్థానాల్లో గెలిపిస్తే.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం కాకుండా, బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుకొగలగుతామని కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ అన్నారు.\

Read More...

బీఆర్ఎస్‌కు ఆసలు ఆ ఆలోచనే లేదు: మాజీ మంత్రి కేటీఆర్ 

Tags:    

Similar News