రేపు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. మూడు స్థానల భర్తీకి ఎన్నికలు

రాజ్యసభ సభ‌కు తెలంగాణ రాష్ట్ర కోటాలో ఎంపికైన (బడుగుల లింగయ్యయాదవ్, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర) ఏప్రిల్ 2తో పదవీ కాలం పూర్తి అవుతుంది.

Update: 2024-02-07 15:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్యసభ సభ‌కు తెలంగాణ రాష్ట్ర కోటాలో ఎంపికైన (బడుగుల లింగయ్యయాదవ్, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర) ఏప్రిల్ 2తో పదవీ కాలం పూర్తి అవుతుంది. దీంతో ఈ మూడు స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ 15న తుది గడువు కాగా, 16న నామినేషన్ల పరిశీలన, 20న ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజూ సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టి ఫలితాలను వెంటనే వెల్లడించనున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం 65 మంది ఎమ్మెల్యేలు కాగా, రెండు ఎంపీ స్థానాలు, బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక స్థానం దక్కనుంది.  

Tags:    

Similar News