విధుల్లో చేరిన వీఆర్ఏలు

కామారెడ్డి మండలంలో పనిచేస్తున్న వీఆర్ఏలు ఎట్టకేలకు విధుల్లో చేరారు.

Update: 2022-10-13 10:26 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలంలో పనిచేస్తున్న వీఆర్ఏలు ఎట్టకేలకు విధుల్లో చేరారు. గత 80 రోజులుగా వీఆర్ఏలు సమ్మెలో ఉన్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని ప్రకటించిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 80 రోజులుగా సమ్మెబాట పట్టారు. ఎట్టకేలకు మునుగోడు ఎన్నిక వేళ వీఆర్ఏలతో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశమై డిమాండ్లపై జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. గురువారం వారు ఎప్పటిలాగే తమ విధులకు హాజరయ్యారు.

Tags:    

Similar News